‘ఫ్రీడమ్’కు ఏఐఎంఏ-ఆర్కే స్వామి అవార్డు
ABN , First Publish Date - 2022-09-23T07:23:22+05:30 IST
జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియాకు చెందిన ‘ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్’ బ్రాండ్కు అవార్డు లభించింది. 2022
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియాకు చెందిన ‘ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్’ బ్రాండ్కు అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను ‘ఏఐఎంఏ-ఆర్కే స్వామి హై పెర్ఫార్మెన్స్ బ్రాండ్’ అవార్డు లభించిందని కంపెనీ వెల్లడించింది. ఏఐఎంఏ 49వ నేషనల్ మేనేజ్మెంట్ సదస్సు సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (విక్రయాలు, మార్కెటింగ్) పీ చంద్రశేఖర్ రెడ్డి అవార్డును అందుకున్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ), అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఆర్కే స్వామి కలిసి 2009 లో ఏఐఎంఏ-ఆర్కే స్వామి అవార్డును ఏర్పాటు చేశాయి. దేశీయంగా అభివృద్ధి చెంది మంచి పనితీరు ప్రదర్శించిన బ్రాండ్కు ఈ అవార్డు ఇస్తారు.