స్వాతంత్య్ర యోధులను స్మరించుకోవాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2022-08-16T07:39:41+05:30 IST

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకోవాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

స్వాతంత్య్ర యోధులను స్మరించుకోవాలి : ఎస్పీ
ప్రసంగిస్తున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌

నిర్మల్‌్‌ కల్చరల్‌, ఆగస్టు 15 : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకోవాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సాయుధదళ కార్యాలయంలో నిర్వహించిన వజ్రోత్సవాల్లో పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సాయుధ బలగాలు గౌరవ వంద నాన్ని స్వీకరించారు. దేశానికి అంకితం కావడంలోనే మనిషికి సార్థకత ఉందన్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. డీఎస్పీ జీవన్‌ రెడ్డి, సీఐలు రమేష్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌, రామ్‌ నర్సింహరెడ్డి, తదితర సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T07:39:41+05:30 IST