స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-17T03:57:04+05:30 IST

ప్రతీ ఒక్కరు స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు. మంగళవారం మండలంలోని ఇందన్‌పల్లి గ్రామం నుంచి జన్నారం బస్టాండ్‌ వరకు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవాలి
ర్యాలీ నిర్వహిస్తున్న ఎంపీ సోయం బాపురాలు, నాయకులు

 జన్నారం, ఆగస్టు 16: ప్రతీ ఒక్కరు స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు అన్నారు. మంగళవారం మండలంలోని ఇందన్‌పల్లి గ్రామం నుంచి జన్నారం బస్టాండ్‌ వరకు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.  హరినాయక్‌,  గోలి చందు, దుర్గం గంగాధర్‌, సూర్యం, ప్రవీణ్‌, సురేష్‌, సుగుణ, సత్తన్న, యుగంధర్‌ పాల్గొన్నారు. 

కడెం కాలువకు మరమ్మతు చేయించాలి 

కడెం ప్రధాన కాలువకు మరమ్మతు చేయించి ఆయకట్టు రైతులకు నీరందించాలని కాంగ్రెస్‌, బీజేపీ, రైతు సంఘాల నాయకులు ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుకు మంగళవారం వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు కడెం కెనాల్‌ పూర్తిగా దెబ్బతిన్నదని,  మరమ్మతు చేయించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే రైతులు వరి నాట్లు వేసుకుని నీటి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.  


 

Updated Date - 2022-08-17T03:57:04+05:30 IST