గణతంత్ర దినోత్సవంనాడే స్వాతంత్య్ర సమరయోధుడి మృతి
ABN , First Publish Date - 2021-01-27T05:33:03+05:30 IST
గణతంత్ర దినోత్సవమైన మంగళవారం స్వాతంత్య్ర సమరయోధుడు మృతిచెందారు. తిరుమల గాంధీగా పేరుగాంచిన నైనప్పగారి సుబ్బయ్యశెట్టి తిరుపతి నగరం కోదండరామస్వామి ఆలయం సమీపంలోని స్వగృహంలో కన్నుమూశారు.
తిరుపతి(పద్మావతినగర్), జనవరి 26: గణతంత్ర దినోత్సవమైన మంగళవారం స్వాతంత్య్ర సమరయోధుడు మృతిచెందారు. తిరుమల గాంధీగా పేరుగాంచిన నైనప్పగారి సుబ్బయ్యశెట్టి తిరుపతి నగరం కోదండరామస్వామి ఆలయం సమీపంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఈయన 1925 ఆగస్టు 5వ తేదీన జన్మించారు. స్వాతంత్య్ర ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీవీ నరసింహారావు మొదలుకుని ఎంతోమంది ప్రముఖ నేతలకు సన్నిహితంగా ఉండేవారు. వారు తిరుపతి, తిరుమలకు వచ్చినపుడు తిరుమల గాంధీని కలుసుకుని గౌరవించేవారు. స్వాతంత్య్ర సమర యోధుడైన ఆయన గణతంత్ర దినోత్సవంనాడే మృతిచెందడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పించారు. గోవిందధామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.