ఉచిత బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2022-05-29T06:20:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అర్హులందరికీ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం పరిపాలనాధికారికి వినతిపత్రం అందించారు.

ఉచిత బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలి
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారికి వినతిపత్రం అందిస్తున్న బీజేపీ నేతలు


బీజేపీ నాయకులు డిమాండ్‌

పాడేరురూరల్‌, మే 28: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అర్హులందరికీ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం పరిపాలనాధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలం నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ చేపట్టిందన్నారు. ఉచిత బియ్యాన్ని రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించకపోవడం శోచనీయమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశానికి తాకాయన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉచిత బియ్యాన్ని అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మినుముల గోపాలపాత్రుడు, లకే భాస్కరరావు, పాంగి మత్స్యకొండబాబు, కొర్రా ఆనంద్‌, అరిమెల రాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T06:20:03+05:30 IST