ఉచిత వైద్య శిబిరం
ABN , First Publish Date - 2021-01-26T06:41:01+05:30 IST
అటవీశాఖ ఆధ్వర్యంలో మండలంలోని వెల్లుపల్లి గ్రామంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు.
గిద్దలూరు, జనవరి 25 : అటవీశాఖ ఆధ్వర్యంలో మండలంలోని వెల్లుపల్లి గ్రామంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఆదాం గ్రామస్థులను పరీక్షించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామస్థులకు సూచనలు చేశారు. కాచివడపోసిన నీటిని తాగాలని, వేడిగా ఉన్నప్పుడే భోజనాన్ని తినాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ జీవన్కుమార్, సెక్షన్ ఆఫీసర్ జమాల్వలి, ఇంద్రసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.