బాధితులకు ఉచిత న్యాయ సహాయం

ABN , First Publish Date - 2020-08-07T10:38:17+05:30 IST

కరోనా బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తా నని మండల న్యాయసేవా కమిటీ చైర్మన్‌, రెండవ అదనపు జిల్లా జడ్జి సీహెచ్‌.రాజ గోపాలరావు అన్నారు.

బాధితులకు ఉచిత న్యాయ సహాయం

పార్వతీపురంటౌన్‌ : కరోనా బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తా నని మండల న్యాయసేవా కమిటీ చైర్మన్‌, రెండవ అదనపు జిల్లా జడ్జి సీహెచ్‌.రాజ గోపాలరావు అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఐఆర్‌పీడబ్ల్యూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా  బాధితు లకు సంబంధించి వైద్యం లభించుటలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మండల న్యాయ సేవా కమిటీ వారి దృష్టికి తీసుకువస్తే ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని అన్నారు.కార్యక్రమంలో ఐఆర్‌పీడబ్ల్యూవో డైరెక్టర్‌ పి.ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T10:38:17+05:30 IST