Mothers Day : ఉచితంగా తల్లులకు ఆరోగ్య పరీక్షలు
ABN , First Publish Date - 2022-05-08T15:11:34+05:30 IST
మదర్స్ డే సందర్భంగా సెంచురీ ఆస్పత్రిలో తల్లులకు...
హైదరాబాద్ సిటీ : మదర్స్ డే సందర్భంగా సెంచురీ ఆస్పత్రిలో తల్లులకు వారం రోజుల పాటు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆదివారం 8 నుంచి 15వ తేదీ వరకు బంజారాహిల్స్లోని ఆస్పత్రి ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొడుకులు, కుమార్తెలు తమ తల్లుల పేర్లతో 040-67833333 నంబర్కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. రక్తపోటు, మధుమేహం, ఈసీజీ, 2డీ ఎకో తదితర పరీక్షలు, జనరల్ మెడిసిన్ వైద్యుల పరీక్షలు ఉంటాయని, అదనపు పరీక్షలపై 20 శాతం రాయితీ కల్పిస్తామని ఆస్పత్రి వైస్ చైర్మన్ డాక్టర్ హేమంత్ కౌకుంట్ల తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లులందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.