కొవిడ్ బాధితులకు ఉచిత ఆహారం
ABN , First Publish Date - 2021-05-07T10:19:16+05:30 IST
విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న తెలంగాణ పోలీస్లు మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొవిడ్
బ్రోచర్ను విడుదల చేస్తున్న స్వాతిలక్రా, సుమతి
7799616163కు వివరాలు పంపితే చాలు
‘సేవా ఆహార్’ను ప్రారంభించిన పోలీస్
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న తెలంగాణ పోలీస్లు మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొవిడ్ బాధితులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించే సేవలను అదనపు డీజీపీ స్వాతిలక్రా గురువారం ప్రారంభించారు. ఇందుకోసం సత్యసాయి సేవా ఆర్గనైజేషన్, లీడ్ లైఫ్ ఫౌండేషన్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, హోప్ సంస్థల సహకారం తీసుకుంటున్నారు. పాజిటివ్ రిపోర్టు, ఇంటి చిరునామా, లొకేషన్ను 7799616163నంబరుకు వాట్సాప్ చేస్తే చాలు.. ఇంటికే భోజనం తెచ్చిస్తారు. ఈ సేవను విస్తరించేందుకు‘ సేవా ఆహార్’ యాప్ను అందుబాటులోకి తెస్తున్నారు.