Delhi ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కొవిడ్ Booster Shots

ABN , First Publish Date - 2022-04-16T13:29:13+05:30 IST

దేశంలోనే ప్రథమంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్ టీకాలు వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....

Delhi ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కొవిడ్ Booster Shots

న్యూఢిల్లీ: దేశంలోనే ప్రథమంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్ టీకాలు వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్ టీకాలు వేయాలని ఢిల్లీ సర్కారు తెలిపింది.18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్‌ల యొక్క ముందస్తు జాగ్రత్త మోతాదులను భారతదేశం అంతటా ఆదివారం ప్రైవేట్ కేంద్రాలలో విడుదల చేసింది. రెండో షాట్ తర్వాత తొమ్మిది నెలలు పూర్తయిన వారు ఈ టీకా వేయించుకోవడానికి అర్హులు. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతున్న దృష్ట్యా టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు.


ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులను నిల్వ ఉంచాలని మంత్రి ఆదేశించారు.కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 24 గంటల పాటు పనిచేసేలా కొవిడ్ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. 


Updated Date - 2022-04-16T13:29:13+05:30 IST