ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో Free coaching classes
ABN , First Publish Date - 2022-05-09T00:49:28+05:30 IST
గత కొన్నేళ్లుగా వేలాది మందికి ఉచిత ఉపాధి, Employeement training ఇస్తూ, వందలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలను ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ కల్పిస్తోంది.
మహబూబాబాద్: గత కొన్నేళ్లుగా వేలాది మందికి ఉచిత ఉపాధి, Employeement training ఇస్తూ, వందలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలను ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ కల్పిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(dayakar rao) సతీమణి ఉషా దయాకర్ రావు( Usha dayakar rao) నేతృత్వంలో ఈ ట్రస్ట్ కొనసాగుతోంది. తాజాగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో police (S.I) & groups (2, 3, 4) ఉచిత శిక్షణ తరగతులు మే 9 తేది నుండి మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో ప్రారంభం అవుతున్నాయి.పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు లు విజ్ఞప్తి చేశారు.
ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు పాలకుర్తి తొర్రూరు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆధార్ కార్డు, ఫొటోతో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఉద్యోగార్థులకు వారు పిలుపునిచ్చారు.తొర్రూరు లోని శ్రీనివాస గార్డెన్ లో ప్రతి రోజు ఉదయ 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.ఇతర వివరాల కోసం ఫోన్ నెంబరు : 9550032354 ను సంప్రదించాలని వారు తెలిపారు.కాగా, గతంలో నిర్వహించిన ఈ శిక్షణ ల ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న ఉద్యోగాల్లో అవకాశాలు పొందాలని వారు చెప్పారు.