క్రెడిట్ లిమిట్ పెంచుతామని మహిళ కాల్ చేసి...
ABN , First Publish Date - 2021-06-12T16:09:51+05:30 IST
క్రెడిట్ కార్డు లిమిట్ ఐదు లక్షలకు పెంచుతామని నగరానికి
- మహిళ కార్డు నుంచి రూ. 3.62 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
హైదరాబాద్ సిటీ/హిమాయత్ నగర్ : క్రెడిట్ కార్డు లిమిట్ ఐదు లక్షలకు పెంచుతామని నగరానికి చెందిన మహిళను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. మూడున్నర లక్షల రూపాయలకు పైగా కాజేశారు. హైమావతి అనే మహిళకు నాలుగు లక్షల క్రెడిట్ సదుపాయం ఉన్న ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంది. గురువారం ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. మీ కార్డు లిమిట్ పెంచడానికి బ్యాంక్ అనుమతించిందని, కార్డు, సీవీవీ నంబర్లు చెప్పమన్నాడు. అతడి మాటలు నమ్మిన ఆమె ఆ వివరాలతోపాటు మొబైల్ నంబర్కు వచ్చి న ఓటీపీ నంబర్లు కూడా చెప్పిం ది. ఫోన్ కట్ చేయకుండా ఆమెను మాటలతో మభ్యపెడుతూ రూ. 3.62 లక్షలు తన ఖాతాలోకి బదిలీ చేసుకున్న తర్వాత కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్స్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది.