హైదరాబాద్‌లో కలకలం.. నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. లైంగిక దాడి..!

ABN , First Publish Date - 2021-07-06T17:52:44+05:30 IST

నాలుగేళ్ల చిన్నారిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఆపై అత్యాచారానికి...

హైదరాబాద్‌లో కలకలం.. నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. లైంగిక దాడి..!

  • పాపను దమ్మాయిగూడలో పడేసి వెళ్లిన దుండగులు
  • చిన్నారిని చికిత్స కోసం నీలోఫర్‌కు తరలించిన పోలీసులు
  • నిందితుల కోసం పోలీస్‌ బృందాల వేట
  • పోలీసుల అదుపులో దుండగుడు..?
  • జవహర్‌నగర్‌లో కలకలం

హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : నాలుగేళ్ల చిన్నారిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడిన మృగాళ్లు బాలికను ప్రగతినగ్‌లోని వాటర్‌ట్యాంక్‌ వద్ద పడేసి వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... నాలుగేళ్ల చిన్నారి ఆదివారం ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఇంటికి దగ్గరలోనే వారి దుకాణం ఉంది. రోజూ కాసేపు ఆడుకున్న అనంతరం చిన్నారి ఒక్కతే షాపునకు వెళ్తుంది. పాప ఒంటరిగా వెళ్తున్నట్టు గుర్తించిన దుండగులు మాయమాటలతో చిన్నారిని ఎత్తుకుపోయారు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాప కనిపించకపోవడం, దుకాణం వద్ద కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రాత్రి వరకు అన్ని చోట్లా గాలించారు. చిన్నారి ఆచూకీ లభించలేదు.


పోలీసుల అదుపులో నిందితుడు..?

చిన్నారిని కిడ్నాప్‌ చేసి లైంగిక దాడి జరిపినట్లు నిర్ధారణ కావడంతో.. జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కేసును సీరియ్‌సగా తీసుకున్నారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. ప్రత్యేక బృందాలతో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. టెక్నికల్‌ ఆధారాలతో అనుమానితుడిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. చిన్నారి కిడ్నాప్‌, లైంగిక దాడి ఘటనలో నిందితులు ఒక్కరా..? ఇద్దరా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


బాధిత కుటుంబీకులు రాత్రి పొద్దుపోయిన తర్వాత జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నారిని తీసుకెళ్లినట్లు తెలియడంతో కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. అనంతరం ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులకు సోమవారం ఉదయం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్‌ వాటర్‌ట్యాంక్‌ వద్ద చిన్నారి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం నీలోఫర్‌కు తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Updated Date - 2021-07-06T17:52:44+05:30 IST