పధ్నాలుగు వేల ‘ఆధార్’ కేంద్రాలు తెరిచే ఉన్నాయి...

ABN , First Publish Date - 2020-06-05T20:12:02+05:30 IST

ఆధార్‌‌కార్డులో మార్పు చేర్పులు చేసుకోవాలనుకునే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో 14 వేల ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉన్నట్టు ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ తెలిపింది.

పధ్నాలుగు వేల ‘ఆధార్’ కేంద్రాలు తెరిచే ఉన్నాయి...

న్యూఢిల్లీ : ఆధార్‌‌కార్డులో మార్పు చేర్పులు చేసుకోవాలనుకునే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో 14 వేల ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉన్నట్టు ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ తెలిపింది. 


ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధార్ కేంద్రాలతోపాటు తపాలా కార్యాలయాలు,  బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ సెంటర్లు తదితర వాటిలో కలిపి మొత్తం 14 వేల ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉన్నట్టు యూఐడీఏఐ ట్వీట్ చేసింది. 


తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లోని మాదాపూర్, విజయవాడలోని లబ్బీపేట, విశాఖపట్టణంలోని ద్వారకానగర్, వరంగల్‌లోని నయీంనగర్‌లలో ప్రస్తుతం ఆధార్ సేవా కేంద్రాలు తెరుచుకున్నట్టు తెలిపింది.

Updated Date - 2020-06-05T20:12:02+05:30 IST