తిరుమలలో జీయంగార్ల చాతుర్మాస దీక్ష
ABN , First Publish Date - 2021-07-26T08:44:10+05:30 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం పెద్దజీయర్ నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది.
తిరుమల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం పెద్దజీయర్ నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా పెద్దజీయర్ మఠంలో కలశ స్థాపన, కలశపూజ, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సేకరించిన పుట్టమన్నుకు పూజలు చేసి, చాతుర్మాస సంకల్పం స్వీకరించారు. మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి చేరుకున్న పెద్దజీయర్, చిన్నజీయర్, శిష్యబృందానికి శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఇతర అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్నాక పెద్దజీయర్కు మేల్చాట్ వస్త్రాన్ని, చిన్నజీయర్కు నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు.