నలుగురు డిశ్చార్జి
ABN , First Publish Date - 2020-06-06T09:26:01+05:30 IST
జిల్లాలో కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు
కరోనా డిశ్చార్జ్ల సంఖ్య 641
కర్నూలు(హాస్పిటల్), జూన్ 5: జిల్లాలో కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో చాలా రోజుల తర్వాత శుక్రవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ కొవిడ్ ఆసుపత్రి నుంచి నలుగురు కరోనాను జయించి డిశ్చార్జి అయ్యారు. ఇందులో కర్నూలు నగర వాసులు ముగ్గురు, ఆదోనివాసి ఒకరు ఉన్నారు. కర్నూలు నగరానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 641 మంది డిశ్చార్జి అయ్యారు.