ఒకే కుటుంబంలో నలుగురు బలి
ABN , First Publish Date - 2020-08-15T10:47:59+05:30 IST
కరోనా ఒకే కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ వక్తికి గత నెల 14న ..
ఆళ్లగడ్డ, ఆగస్టు14: కరోనా ఒకే కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ వక్తికి గత నెల 14న కొవిడ్ సోకటంతో చికిత్స కోసం కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతిచెందాడు. ఆ తర్వాత పరీక్షల్లో ఆయన తల్లి, మామ, బావమరిదికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో నంద్యాల కొవిడ్ వైద్యశాలలో చేరారు. అక్కడ మూడురోజుల క్రితం ఆయన తల్లి, రెండు రోజుల క్రితం మామ, గత రాత్రి బావమరిది మృతిచెందారు.