నేటి నుంచి తాత్కాలికంగా నాలుగు రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2021-05-14T06:23:58+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.

నేటి నుంచి తాత్కాలికంగా నాలుగు రైళ్ల రద్దు

తిరుపతి(కొర్లగుంట), మే 13: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో కొద్ది రోజులుగా ప్రయాణికులు లేక పలు రైళ్లు ఖాళీగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు శుక్రవారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నాలుగు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.విశాఖపట్టణం- కడప(07488)ఎక్స్‌ప్రెస్‌ను 14నుంచి 31వ తేదీ వరకు, కడప-విశాఖపట్టణం (07487)ఎక్స్‌ప్రెస్‌ను 15నుంచి జూన్‌ 1వరకు, విశాఖపట్టణం-లింగంపల్లి (02831) ఎక్స్‌ప్రెస్‌ను 14నుంచి 31వ తేదీ వరకు, లింగంపల్లి-విశాఖపట్టణం (02832)ఎక్స్‌ప్రెస్‌ను 15నుంచి జూన్‌ 1వరకు రద్దు చేశారు . ప్రయాణికులు ఈ సమాచారాన్ని గమనించి సహకరించాలని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-14T06:23:58+05:30 IST