Jammu and Kashmirలో ఎన్‌కౌంటర్...నలుగురు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-03-12T14:02:18+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు....

Jammu and Kashmirలో ఎన్‌కౌంటర్...నలుగురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.జమ్మూకశ్మీర్‌లోని గండర్‌బాల్, పుల్వామా,  హంద్వారా జిల్లాల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు.‘‘మేం నిన్న రాత్రి నాలుగైదు ప్రదేశాలలో ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించాం. ఇప్పటివరకు పుల్వామాలో ఒక పాకిస్థానీతో సహా జైషే మహ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, గండర్‌బాల్, హంద్వారాలో ఒక్కొక్క ఉగ్రవాదిని హతమార్చాం. హంద్వారా, పుల్వామాలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. అలాగే ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాం’’ అని జమ్మూ కశ్మీర్ ఐజీ శనివారం ట్వీట్ చేశారు.


 గండర్‌బాల్ జిల్లాలోని సెర్చ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు.ఈ ఎదురుకాల్పుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు.దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని చెవా కలాన్ ప్రాంతంలో రాత్రిపూట జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.హంద్వారాలోని నెచామా, రాజ్‌వార్ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదుల గాలింపు   ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.


Updated Date - 2022-03-12T14:02:18+05:30 IST