ఏజెన్సీలో నలుగురు ఉపాధ్యాయులు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-03-04T05:39:17+05:30 IST

ఏజెన్సీలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యా యులను కలెక్టర్‌ సస్పెండ్‌ చేసినట్టు ఐటీడీఏ పీవో ఆర్‌ సూర్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపారు.

ఏజెన్సీలో నలుగురు ఉపాధ్యాయులు సస్పెన్షన్‌

బుట్టాయగూడెం, మార్చి 3:ఏజెన్సీలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యా యులను కలెక్టర్‌ సస్పెండ్‌ చేసినట్టు ఐటీడీఏ పీవో ఆర్‌ సూర్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న తెల్లం రాములు, సోదెం రాజు, మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న జలగం రాంబాబు, కూరం రమేశ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నందున సస్పెండ్‌ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నలుగురు ఉపాధ్యాయులను ఒకేసారి సస్పెండ్‌ చేయడం ఏజెన్సీలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Updated Date - 2021-03-04T05:39:17+05:30 IST