నలుగురు తమిళ స్మగ్లర్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-06-24T04:54:20+05:30 IST
ఓబులవారిపల్లె మండ లం వై.కోట అడవిలో బు ధవారం నలుగురు తమి ళ స్మగ్లర్లను అరెస్టు చేసి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వేకోడూరు సబ్ డీఎ్ఫవో ధర్మరాజు, రేంజ ర్ నయీమ్ఆలీ తెలిపారు.
10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు, జూన్ 23: ఓబులవారిపల్లె మండ లం వై.కోట అడవిలో బు ధవారం నలుగురు తమి ళ స్మగ్లర్లను అరెస్టు చేసి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వేకోడూరు సబ్ డీఎ్ఫవో ధర్మరాజు, రేంజ ర్ నయీమ్ఆలీ తెలిపారు. బుధవారం వారు విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాజంపేట డీఎ్ఫవో జి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు రైల్వేకోడూరు రేంజి అధికారులు, సిబ్బంది కలసి కూంబింగ్ నిర్వహిస్తుండగా కేవీ బావి సౌత్ బీట్లోని మట్లకోన ప్రదేశంలో దుంగలను స్మగ్లర్లు తరలిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నామన్నారు. 10 ఎర్రచందనం దుంగలతో పాటు 10 గొడ్డళ్లు, వంటపాత్రలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుక్నునట్లు వివరించారు. 15 మంది స్మగ్లర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుమన్నామలై, వేలురు ప్రాంతాలకు చెందిన పొన్నుస్వామి, వీపాండిమణి, పెరియాండి, గణేశన్లను అరెస్టు చేసినట్లు వివరించారు. దాడుల్లో డిప్యూటీ రేంజర్ మహే్షకుమార్, ఎఫ్ఎ్సవో బాబాసాహెబ్, ఎఫ్బీవో జనార్ధన్, ఎఫ్బీవో శ్రీరామమూర్తి, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
ఒంటిమిట్టలో 34 దుంగలు...
ఒంటిమిట్ట, జూన్ 23 : మండల పరిధిలోని ఇరుకురాళ్లబోటు వద్ద 34 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ అధికారులు వివరాల మేరకు... కోడూరు నుంచి కడప వైపు వెళుతున్న వాహనాన్ని ముందస్తు సమాచారం మేరకు తనిఖీ చేయడంతో ఏపీ03టిడి4948 లారీలో 34 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. కోడూరు మండలం ఓబన్నపల్లికి చెందిన ఉప్పుటూరు శ్రీరాములు అనే వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో రవికుమార్, డీఎ్సవో శ్రీనివాసులు, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.