కరాటే బ్లాక్ బెల్ట్కు నలుగురు విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2021-03-08T04:44:13+05:30 IST
పట్టణంలోని వాసవి హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షల్లో నలుగురు విద్యార్థులు బ్లాక్ బెల్ట్ను సాధించారు.
భైంసా, మార్చి 7 : పట్టణంలోని వాసవి హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షల్లో నలుగురు విద్యార్థులు బ్లాక్ బెల్ట్ను సాధించారు. తెలంగాణ రాష్ట్ర జేకేఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీ ల్లో వివిధ విభాగాల్లో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనూష, జ్ఞానతేజ, రాజశ్రీ, విఘ్నేష్లు బ్లాక్ బెల్ట్ను సాధించారు. జేకేఏఐ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క ధర్మరాజ్, జాయింట్ సెక్రెటరీ తేజేందర్ సింగ్ బాటియా, నిర్మల్ జి ల్లా అధ్యక్షుడు కె.శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు చందుల స్వామి, కోశాధికారి శ్రీరాముల సాయికృష్ణ, జిల్లా మహిళ ప్రతినిధి మృణాలిణిల పర్యవేక్షణలో బెల్ట్ టెస్టింగ్ పోటీలు కొనసాగాయి. పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు కరాటేలో ప్రతిభను చాటుకొని వివిధ బెల్ట్లను సాధించారు. కరాటే మాస్టర్ శివరాజ్ గౌడ్, లింగం, శరణ్ తేజ, నితిన్ గౌడ్, వైష్ణవిలు పోటీలను పర్యవేక్షించారు.