గంజాయి తాగుతున్న నలుగురు విద్యార్థుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-15T12:49:46+05:30 IST
ఆల్వీన్కాలనీలో గంజాయి తాగుతున్న నలుగురు విద్యార్థులను జగద్గిరిగుట్ట
హైదరాబాద్/జీడిమెట్ల : ఆల్వీన్కాలనీలో గంజాయి తాగుతున్న నలుగురు విద్యార్థులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి గంజాయి, హుక్కా సామాను స్వాధీనం చేసుకున్నారు. అంజయ్యనగర్కు చెందిన నర్సింహారెడ్డి కుమారుడు సిరిగిద్ద శశాంక్రెడ్డి(22) కీసరలోని ఓ ఇంజనీరింగ్కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి సమీపంలో ఓ పెంట్ హౌజ్ను అద్దెకు తీసుకుని స్నేహితులతో ఉంటున్నాడు. ఆల్వీన్ కాలనీలోనిలో ఓ వ్యక్తి వద్ద శంశాక్రెడ్డి గంజాయి కొనుగోలు చేసి తన స్నేహితులైన విజయ్నగర్ కాలనీకి చెందిన రాజేందర్ప్రసాద్ కుమారుడు తన్మయి శ్రీసాయి(22), ఆల్వీనికాలనీకి చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు కుమారుడు పి.అరుణ్కుమార్(22), కందిరేగుల అవినాష్ (25)తో కలిసి ఈ నెల 13న గదిలో గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 700గ్రాముల గంజాయి, హుక్కా సామాను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.