వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-08-29T03:19:01+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఖమ్మంలోని కల్లూరు డీఎన్‌పీ ఫంక్షన్ హాల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ట్రాలీ ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను చెన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్‌ (20), నాగభూషణం (18)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 




భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఇల్లందులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ దగ్గర బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అనే యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


 విద్యుదాఘాతంతో 

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. దుమ్ముగూడెం మండలం బండారిగూడెంలో విద్యుదాఘాతంతో  వంశీ (18) అనే వ్యక్తి మృతి చెందాడు. 

Updated Date - 2021-08-29T03:19:01+05:30 IST