Washingtonలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి!

ABN , First Publish Date - 2021-07-18T16:57:26+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. శనివారం రాత్రి దేశ రాజధాని వాషింగ్టన్‌లోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఉన్న నేషనల్ బేస్‌బాల్ స్టేడియం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి.

Washingtonలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. శనివారం రాత్రి దేశ రాజధాని వాషింగ్టన్‌లోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఉన్న నేషనల్ బేస్‌బాల్ స్టేడియం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు డిస్ట్రిక్ట్ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించింది. ఇద్దరు స్టేడియం బయట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం. వాషింగ్టన్ నేషనల్స్, శాన్ డీగో పాడ్రెస్ మధ్య జరగాల్సిన బేస్‌బాల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్టేడియం నుంచి ప్రేక్షలను బయటకు పంపించేశారు. నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Updated Date - 2021-07-18T16:57:26+05:30 IST