చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి
ABN , First Publish Date - 2021-03-15T02:19:49+05:30 IST
జిల్లాలో చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు.
అనంతపురం: జిల్లాలో చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన పెనుకొండలో చోటుచేసుకుంది. పెనుకొండలోని భోగ సముద్రం చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మృతులను అనంతపురం సూర్యానగర్ వాసులుగా గుర్తించారు. మృతులను తస్లీమా (14), సాదిక్ (40), అల్లాబక్ష్ (45), పాషా (17)గా గుర్తించారు. పెనుకొండలో ప్రఖ్యాతి గాంచిన దర్గా దర్శనానికి ఈ కుటుంబం వెళ్లింది. చివరికి ఈ కుటుంబంలో విషాదం మిగిలింది.