మహమ్మారి బారినపడ్డ మరో నలుగురు భారతీయులు

ABN , First Publish Date - 2020-02-23T22:43:43+05:30 IST

కరోనా (కొవిడ్-19) వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఒక్క చైనాలోనే ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది మరణించా

మహమ్మారి బారినపడ్డ మరో నలుగురు భారతీయులు

న్యూఢిల్లీ: కరోనా (కొవిడ్-19) వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఒక్క చైనాలోనే ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది మరణించారు. దాదాపు 28 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కాగా.. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న మరో నలుగురు భారతీయులు ఈ మహమ్మారి బారినపడ్డట్లు అధికారులు తెలిపారు. దీంతో నౌకలో వైరస్ బారినపడిన భారతీయుల సంఖ్య 12కు చేరింది. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో మొత్తం 3711 మంది ఉండగా.. అందులో 138 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 132 మంది అందులో పనిచేస్తుండగా.. మిగిలిన ఆరుగురు ప్రయాణికులు.

Updated Date - 2020-02-23T22:43:43+05:30 IST