Bangaloreలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2022-01-08T14:42:02+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు...

Bangaloreలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి దుర్మరణం

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.బెంగళూరు  నగరంలో వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. ట్రక్కు డ్రైవరు రాష్, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. నైస్ రోడ్డులోని పూర్వాంకర అపార్టుమెంటు వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ డీసీపీ కుల్దీప్ జైన్ చెప్పారు.ఈ ఘటనలో గాయపడిన ఆరుగురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


Updated Date - 2022-01-08T14:42:02+05:30 IST