నైజీరియాలో ట్యాంకర్ పేలుడు...నలుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-24T10:46:55+05:30 IST

నైజీరియా దేశంలోని డెల్టా స్టేట్ లో జరిగిన ట్యాంకరు పేలుడులో నలుగురు దుర్మణం చెందారు....

నైజీరియాలో ట్యాంకర్ పేలుడు...నలుగురి దుర్మరణం

అబుజా (నైజీరియా): నైజీరియా దేశంలోని డెల్టా స్టేట్ లో జరిగిన గ్యాస్ ట్యాంకరు పేలుడులో నలుగురు దుర్మణం చెందారు. నైజీరియాలోని అగ్ బార్ ప్రాంతంలో ఓ గ్యాస్ స్టేషనులో గ్యాస్ ఎక్కిస్తుండగా హఠాత్తుగా ట్యాంకర్ పేలింది. ఈ పేలుడు ఘటనలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటనలో మరో 11 మందికి కాలిన గాయాలయ్యాయి. గ్యాస్ ట్యాంకరు పేలుడు వల్ల సమీపంలోని పలు ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయని నైజీరియా గవర్నరు ఇఫియన్ ఒక్వా చెప్పారు. గ్యాస్ ట్యాంకరు పేలుడు ఘటన దురదృష్ణ కరమని గవర్నరు వ్యాఖ్యానించారు. ట్యాంకరు పేలుడు ఘటనపై నైజీరియా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-01-24T10:46:55+05:30 IST