Haryana గ్రామంలో కొండచరియలు విరిగిపడి నలుగురు బాలికల మృతి

ABN , First Publish Date - 2022-01-11T15:00:07+05:30 IST

హర్యానా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు బాలికలు సజీవ సమాధి అయ్యారు...

Haryana గ్రామంలో కొండచరియలు విరిగిపడి నలుగురు బాలికల మృతి

మేవట్ (హర్యానా): హర్యానా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు బాలికలు సజీవ సమాధి అయ్యారు. మేవట్ పట్టణ సమీపంలోని కంగర్కా గ్రామానికి చెందిన నలుగురు బాలికలు ఇళ్ల కోసం మట్టిని తీసుకురావడం కోసం వెళ్లారు. మట్టి తవ్వుతుండగా ఆకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు బాలికలు మరణించారు. గ్రామస్థులు హుటాహుటిన తరలివచ్చి బాలికల మృతదేహాలను వెలికితీశారు.మృతుల్లో బాలికలు వకీలా(19), జానిస్తా(18), తస్లీమా(10), గులాప్షా(9)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోఫియా అనే మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-11T15:00:07+05:30 IST