విమాన ప్రమాదం: ఫుట్బాలర్ల దుర్మరణం
ABN , First Publish Date - 2021-01-26T08:30:43+05:30 IST
బ్రెజిల్లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్బాలర్లు దుర్మరణం పాలయ్యారు. టోకాన్టిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్మాస్ క్లబ్కు చెందిన నలుగురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు...
రియో డిజనీరో: బ్రెజిల్లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్బాలర్లు దుర్మరణం పాలయ్యారు. టోకాన్టిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్మాస్ క్లబ్కు చెందిన నలుగురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. ఆదివారం క్వారంటైన్ ముగియడంతో గొయీనియాలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు జట్టుతోకాక ప్రత్యేక విమానంలో బయలుదేరారు. రన్వే దాటిన వెంటనే విమానం ప్రమాదానికి లోనైంది. దాంతో నలుగురు సాకర్ ఆటగాళ్లతోపాటు పాల్మాస్ క్లబ్ అధ్యక్షుడు లుకాస్ మీరా మృతి చెందారు.