చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతు
ABN , First Publish Date - 2022-07-05T18:41:26+05:30 IST
పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
విజయవాడ: పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. మచిలీపట్నం మండలం క్యాంబెల్పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు నాలుగు రోజుల క్రితం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. కాగా... తాము ప్రయాణిస్తున్న బోటు ఇంజన్ పాడైనట్లు కుటుంబ సభ్యులకు మత్స్యకారులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే గత రెండు రోజుల నుంచి వారి సెల్ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన మత్యకారులు విశ్వనాథపల్లి చినమస్తాన్ రామాని, నాంచార్లు, చెక్క నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావుగా గుర్తించారు. మరో బోటులో క్యాంబెల్పేట మత్స్యకారుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.