Keralaలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మత్స్యకారుల మృతి

ABN , First Publish Date - 2021-12-28T16:38:16+05:30 IST

కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మత్స్యకారులు మరణించారు....

Keralaలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మత్స్యకారుల మృతి

20మందికి గాయాలు

కొల్లాం(కేరళ): కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మత్స్యకారులు మరణించారు.కొల్లాం జిల్లాలో వేగంగా వస్తున్న లారీ వ్యాన్ ను ఢీకొనడంతో నలుగురు మత్స్యకారులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. మత్స్యకారులు చేపల వేట కోసం విజింజం నుంచి బేపూర్ కు వ్యానులో వెళుతుండగా చేపలతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో కరుణాంబరం (56), బార్కుమాన్స్ (45), జస్టిన్ (56), తమిళనాడుకు చెందిన బిజు (35)లు మరణించారు. గాయపడిన ఇద్దరిని తిరువనంతపురం వైద్య కళాశాలకు తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.లారీ వ్యాన్ ను ఢీకొన్నపుడు 34 మంది ఉన్నారు. క్షతగాత్రులను కరునాగపల్లిలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది తమిళనాడు వాసులని పోలీసులు చెప్పారు.


Updated Date - 2021-12-28T16:38:16+05:30 IST