వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2022-06-27T04:51:21+05:30 IST

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెం దారు.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
చంద్రశేఖర్‌ మృతదేహం

ఎర్రగుంట్ల, పోట్లదుర్తి వద్ద యువకులు

వల్లూరు వద్ద బాలుడు 

చిన్నమండెం వద్ద వ్యక్తి మృతి

 వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెం దారు. చిలమకూరు ఐసీఎల్‌ కర్మాగారం మెయిన్‌ గేటు వద్ద కారు ఢీకొనడంతో చం ద్రశేఖర్‌(28), వల్లూరు వద్ద బాలుడు కొరముట్ల దినేష్‌ (8), పోట్లదుర్తి పెన్నానది వంతెన వద్ద శివచంద్ర(19), అన్నమయ్య జిల్లా చిన్న మండెంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆనమల్లు రామయ్య(65), మృతిచెం దారు. వివరాల్లో కెళితే....

ఎర్రగుంట్ల, జూన్‌ 26: చిలమకూరు ఐసీఎల్‌ కర్మాగారం మెయిన్‌గేటు వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. చంద్రశేఖర్‌ సైడ్‌ రోడ్డునుంచి నేషనల్‌ హైవే ఎక్కుతుండగా అటువైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ చంద్ర శేఖర్‌ మృ తిచెందాడు. ముద్దనూరు వైపు వెళుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి సంఘటనా స్థలం వద్ద దిగి పరిశీలించారు. మృ తుడు చిలమకూరు వాసి అతనికి భార్య ఇద్దరు పిల్లలున్నట్లు అర్బన్‌ సీఐ మంజునాథరెడ్డి తెలి పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 మండలంలోని పోట్లదుర్తి పెన్నా బ్రిడ్జి సమీప ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆదివారం ఆటో బైక్‌ను ఢీకొనడంతో శివచంద్ర మరణించినట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. కల్లూరు వాసి శివచంద్ర బేల్దారిగా పనిచేస్తున్నాడు. ఎర్రగుం ట్ల వైపు బైక్‌లో వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో మృతిచెందినట్లు ఆయన తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు. 

వల్లూరు వద్ద...

వల్లూరు, జూన్‌ 26: కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై వల్లూరు మండలం ఈత చెట్టు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటాపురం వీవర్స్‌ కాలనీ వాసు లు కొరముట్ల ప్రసాద్‌, లక్ష్మీదేవి కుమారుడు దినేష్‌ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు అక్కెనగు ట్ల నరేంద్రబాబు, పట్టుపోగుల పవన్‌కుమార్‌, కంచన త్రివిక్రమ్‌, కొరముట్ల దినే్‌ష ఆటోలో వెళతుండగా కడప వైపున కు వెళుతున్న కంటైనర్‌ ఆటోను ఢీకొంది. దీంతో ఆటో నుంచి కింద పడ్డ దినేష్‌ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

మిగిలిన ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నరేంద్రబాబు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను  చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా దాదాపు ఆరు గంటల పాటు ట్రాఫిక్‌ అంతరాయం కలగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కడప రూరల్‌ సీఐ శ్రీరామ శ్రీనివాసులు సంఘటనా స్థలాని కి చేరుకుని పరిశీలించి ప్రమాద వివరాలను ఆరా తీశారు. 

బలిజపల్లె క్రాస్‌ వద్ద....

చిన్నమండెం, జూన్‌ 26: స్థానిక పోలీ్‌సస్టేషన్‌కు కూతవేటు దూరంలో బలిజపల్లె క్రాస్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆనమల్లు రామయ్య మృతి చెందినట్లు ఎస్‌ఐ రామాంజనేయుడు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు గుర్రంకొండ మండలం తుమ్మలగొం ది గ్రామం కుమ్మరపల్లె నివాసి రామయ్య చిన్నమండెంలోని బంధువులు ఇంటికి వచ్చి తెల్లవారుజామున గుర్తు తెలియ ని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. డ్యూటీకి వెళ్తున్న పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.



Updated Date - 2022-06-27T04:51:21+05:30 IST