Bengaluru: నాలుగు మృతదేహాలతో ఐదు రోజులు గడిపిన బాలిక

ABN , First Publish Date - 2021-09-18T13:22:27+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరం బైడరహల్లి ప్రాంతంలో ఒక ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులు శవాలై కనిపించారు....

Bengaluru: నాలుగు మృతదేహాలతో ఐదు రోజులు గడిపిన బాలిక

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరం బైడరహల్లి ప్రాంతంలో ఒక ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులు శవాలై కనిపించారు. బైదరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లి సించన (34), అమ్మమ్మ భారతి (51), తల్లి సోదరి సింధూరాణి (31), తల్లి సోదరుడు మధుసాగర్ (25) మృతదేహాలు పైకప్పుకు వేలాడుతూ పోలీసులకు కనిపించాయి. మధుసాగర్ ఉరి వేసుకున్న గదిలో ఓ బాలిక ఐదు రోజుల పాటు ఆకలితో అలమటిస్తూ అపస్మారక స్థితిలో కనిపించింది. బాలిక మృతదేహాలతో ఐదు రోజులు గడపటం సంచలనం రేపింది.దీంతో పోలీసులు బాలికను ఆసుపత్రికి పంపించారు.బాలికకు చికిత్స చేసిన తర్వాత కౌన్సెలింగ్ అవసరమని పోలీసులు చెప్పారు.


నలుగురు కుటుంబసభ్యులు ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని బెంగళూరు డీసీపీ సంజీవ్ ఎం పాటిల్ చెప్పారు.మృతదేహాలకు శనివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు కేసును దర్యాప్తు చేస్తున్న బైద్రహల్లి పోలీసులు తెలిపారు. ఇది ఆత్మహత్య కేసుగా కనిపించినప్పటికీ, పోస్ట్‌మార్టంలో నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

(ఈ ఫైల్ ఫొటోలో పాపను పట్టుకొని నిలబడిన శంకర్ ఇంటి పెద్ద. బాలికకు ఆయన తాత. శంకర్, బాలిక తప్ప మిగిలిన నలుగురూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సీమంతం సందర్భంగా గతంలో తీసిన ఈ చిత్రం ఆత్మహత్యల అనంతరం చూస్తే అందరినీ కలిచివేస్తోంది.) 

Updated Date - 2021-09-18T13:22:27+05:30 IST