Haryana: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-08-27T17:08:46+05:30 IST

హర్యానా రాష్ట్రంలోని భీవానీ జిల్లా జటులోహారి గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు....

Haryana: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి దుర్మరణం

12 మందికి గాయాలు

భీవానీ (హర్యానా): హర్యానా రాష్ట్రంలోని భీవానీ జిల్లా జటులోహారి గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.ఝాన్సీ నుంచి వేగంగా వస్తున్న బస్సు ట్రాలీని దాటబోయి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అతివేగంగా నడపడం వల్లే నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టాడని భీవానీ డిప్యూటీ కమిషనర్ జైబీర్ సింగ్ ఆర్యా చెప్పారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. గాయపడిన 12మందిని రోహతక్ ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారికి సత్వర వైద్యం అందిస్తున్నామని భీవానీ ఎస్పీ అజిత్ సింగ్ షెకావత్ చెప్పారు. అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.


Updated Date - 2021-08-27T17:08:46+05:30 IST