పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ABN , First Publish Date - 2020-07-04T02:44:39+05:30 IST

పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

చిత్తూరు: పీలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు మండలం దుర్గంవారిపల్లె దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అటు వైపు నుంచి వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి తెసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


Updated Date - 2020-07-04T02:44:39+05:30 IST