ఢిల్లీలో ఘోర fire ప్రమాదం...నలుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-10-26T13:33:39+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఓల్డ్ సీమాపురి ప్రాంతంలో మంగళవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు...

ఢిల్లీలో ఘోర fire ప్రమాదం...నలుగురి దుర్మరణం

ఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఓల్డ్ సీమాపురి ప్రాంతంలో మంగళవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. సీమాపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంలోని మూడవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించడంతో నలుగురు సజీవదహనమయ్యారు. ఢిల్లీలోని ఇరుకు గల్లీలో జరిగిన అగ్నిప్రమాదంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు. పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. 


Updated Date - 2021-10-26T13:33:39+05:30 IST