4 కోట్ల మంది పేదరికంలోకి: రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2022-01-24T06:44:33+05:30 IST
దేశంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని, కేవలం ‘హమారే దో’ మాత్రమే అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు...
న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని, కేవలం ‘హమారే దో’ మాత్రమే అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘వికాస్ ఓవర్ఫ్లో’ కేవలం ‘హమారే దో’కు మాత్రమేనని, అయితే 4 కోట్ల మంది దారిద్య్రంలోకి నెట్టబడ్డారని ట్వీట్ చేశారు. ఆక్స్ఫామ్ నివేదికను రాహుల్ ఉటంకిస్తూ 2021లో ఇద్దరు అగ్రశ్రేణి వ్యాపారవేత్తల సంపద బిలియన్ డాలర్లు పెరిగిందన్నారు.