కానిస్టేబుల్ను దూషించిన నలుగురి అరెస్టు
ABN , First Publish Date - 2022-05-18T05:43:11+05:30 IST
కానిస్టేబుల్ను దూషించిన నలుగురి అరెస్టు
యాచారం, మే 17: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను దూషించిన నలుగురిని సోమవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ లింగయ్య తెలిపారు. నగర శివారులోని బాలాపూర్ గ్రామానికి చెందిన వి.మల్లేష్, జి.మహేందర్, వి.వెంకటేష్, రమేష్ సోమవారం యాచారంలో మద్యం దుకాణంలో మద్యం తీసుకొని నిబంధనలకు విరుద్దంగా వెంచర్లో మద్యం తాగుతున్నారు. ఓపెన్ప్లే్సలో మద్యం తాగరాదని సముదాయించిన పోలీస్ కానిస్టేబుల్ రాజు పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దూషించారు. ఈ ఘటనపై స్టేషన్లో సమాచారం అందించగా నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. బహిరంగంగా మద్యం తాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.