జేపీతండాలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2022-08-16T05:59:41+05:30 IST
మండలంలోని జేపీతండాలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన నిధులతో చేపట్టనున్న పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి, అలాగే రాంపూర్ క్రాసింగ్ నుంచి రోడ్డు విస్తరణ పనులకు మంత్రి హరీశ్రావు సోమవారం శంకుస్థాపన చేశారు.
నంగునూరు, ఆగస్టు 15: మండలంలోని జేపీతండాలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన నిధులతో చేపట్టనున్న పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి, అలాగే రాంపూర్ క్రాసింగ్ నుంచి రోడ్డు విస్తరణ పనులకు మంత్రి హరీశ్రావు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ భిక్షపతినాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నవోదయ పాఠశాల ప్రవేశంలో వరుసగా మూడుసార్లు సీటు సాధించేలా కృషిచేసిన తండాలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంగు రామకృష్ణను, ఉపాధ్యాయులు చంద్రంను మంత్రి హరీశ్రావు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన అభివృద్ధిపై క్లుప్తంగా వివరించారు. త్వరలోనే ఇంటి జాగా ఉన్న వాళ్లందరికీ ఇంటి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతినాయక్, ఉపసర్పంచ్ ఆంజనేయులు, ఎంఈవో దేశిరెడ్డి, ఎంపీటీసీ జోత్స్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.