ఫోరమ్ సుజనా.. ఇక నెక్సస్
ABN , First Publish Date - 2022-07-07T08:57:56+05:30 IST
ఇన్వె్స్ట మెంట్ కంపెనీ బ్లాక్స్టోన్ గ్రూప్నకు చెందిన నెక్సస్ మాల్స్ దేశంలో మరిన్ని మాల్స్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇన్వె్స్ట మెంట్ కంపెనీ బ్లాక్స్టోన్ గ్రూప్నకు చెందిన నెక్సస్ మాల్స్ దేశంలో మరిన్ని మాల్స్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే ఉన్న మాల్స్ను సొంతం చేసుకోవడం ద్వారా విస్తరించనున్నామని నెక్సస్ మాల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) జయన్ నాయక్ తెలిపారు. హైదరాబాద్లోని ఫోరమ్ సుజనా మాల్ సహా 13 నగరాల్లో 17 రిటైల్ మాల్స్ నెక్స్సకు ఉన్నాయి. 2021 ప్రెస్టేజ్ గ్రూప్ నుంచి నెక్సస్ 8 మాల్స్ను సొంతం చేసుకుంది. నెక్సస్ మాల్స్ రీ బ్రాండింగ్ను చేపట్టింది. ఇందులో భాగంగా ఫోరమ్ సుజనా, ఫోరమ్ శాంతినికేతన్, ఫోరమ్ కోరమంగళ తదితర పేర్లతో ఉన్న మాల్స్ను నెక్సస్ మాల్స్గా మార్చింది. మాల్స్లో ఫుట్ఫాల్స్ తక్కువగా ఉన్నప్పటికీ కస్టమర్లు చేసే సగటు ఖర్చు పెరిగిందని నాయక్ తెలిపారు. ఎంటర్టైన్మెంట్, ఫుడ్కోర్ట్, ఇతర అన్ని సౌకర్యాలు ఉండే మాల్స్ను వినియోగదారులు కోరుకుంటున్నారని చెప్పారు.