Moroccoలో పడవ బోల్తా పడి 43 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2022-01-18T13:21:14+05:30 IST

దక్షిణ మొరాకో దేశంలోని టార్ఫాయా తీరంలో పడవ బోల్తా పడటంతో ముగ్గురు శిశువులతో సహా 43 మంది వలసదారులు మరణించారని స్పానిష్ సంస్థ కామినాండో ఫ్రాంటెరాస్ తెలిపింది...

Moroccoలో పడవ బోల్తా పడి 43 మంది దుర్మరణం

రబాత్ (మొరాకో): దక్షిణ మొరాకో దేశంలోని టార్ఫాయా తీరంలో పడవ బోల్తా పడటంతో ముగ్గురు శిశువులతో సహా 43 మంది వలసదారులు మరణించారని స్పానిష్ సంస్థ కామినాండో ఫ్రాంటెరాస్ తెలిపింది.ఓడ ప్రమాదం నుంచి పది మందిని రక్షించినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.పడవ ప్రమాదం నుంచి బయటపడిన కొందరు నీళ్లలో ఈతకొడుతూ తెల్లవారుజామున రక్షించమని వేడుకున్నారు.‘‘పడవను గుర్తించి, రక్షించడానికి మొరాకో అధికారులకు గంటల సమయం పట్టింది’’ అని కామినాండో ఫ్రాంటెరాస్ చెప్పారు. మరణించిన 43 మందిలో ఇప్పటివరకు కేవలం ఇద్దరి మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.



వలసదారులు టార్ఫాయా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పానిష్ కానరీ దీవులకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గత సంవత్సరం జరిగిన పడవ ప్రమాదాల్లో 4వేల మందికి పైగా వలసదారులు మరణించారు. వలసదారులు స్పెయిన్‌కు వెళ్లడానికి ప్రయత్నించి మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2022-01-18T13:21:14+05:30 IST