హుస్సేన్సాగర్ తీరాన రయ్రయ్..
ABN , First Publish Date - 2022-07-01T16:07:42+05:30 IST
ఫార్ములా-ఈ కారు రేస్కు నగరం వేదిక కానుంది. హుస్సేన్సాగర్ తీరాన సిద్ధం చేస్తున్న ట్రాక్పై వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేస్
ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఫార్ములా-ఈ రేస్
హైదరాబాద్ సిటీ: ఫార్ములా-ఈ కారు రేస్కు నగరం వేదిక కానుంది. హుస్సేన్సాగర్ తీరాన సిద్ధం చేస్తున్న ట్రాక్పై వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేస్ జరగనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. 2023 సీజన్లో జనవరి నుంచి జూలై మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో ఫార్ములా- ఈ రేస్లు జరగనున్నాయి. ఈ ఈవెంట్ కోసం 2022 ప్రారంభంలోనే ఫార్మలా ఈ, క్లీన్ ఎనర్జీ కంపెనీ గ్రీన్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే సీజన్లో ఓ రేసుకు ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్కు దక్కింది. సీజన్ మొత్తంలో 18 రేసులుండగా అందులో నాలుగోది రాష్ట్ర రాజధానిలో జరగనుంది. హుస్సేన్సాగర్ తీరాన ఉన్న తెలుగుతల్లి ప్లైఓవర్కు ఇరువైపులతో పాటు లుంబినీ పార్కు నుంచి ఎన్టీఆర్ మార్గ్లో రేసింగ్ కారులు దూసుకెళ్లనున్నాయి. ట్రాక్ పొడవు 2.37 కిలోమీటర్ల కాగా ఇందులో ఎనిమిది మలుపులు ఉన్నాయి. కాగా, సాయంత్రం వేళ విద్యుద్దీపాల వెలుగులో రేసు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం.