‘పొలాలకు వెళ్లేందుకు రహదారి కావాలి’
ABN , First Publish Date - 2021-02-27T04:53:39+05:30 IST
పొలాలకు వెళ్లేందుకు రహదారి కావాలని మండలంలోని బందపురం, దుద్దుకూరు గ్రామాల రైతులు పాతూరి గణేష్రా వు, దుద్దుపూడి సత్యనారాయణ, కొండేపేట రాము డిమాండ్ చేశారు.
దేవరపల్లి, ఫిబ్రవరి 26: పొలాలకు వెళ్లేందుకు రహదారి కావాలని మండలంలోని బందపురం, దుద్దుకూరు గ్రామాల రైతులు పాతూరి గణేష్రా వు, దుద్దుపూడి సత్యనారాయణ, కొండేపేట రాము డిమాండ్ చేశారు. బందపు రంలోని హైవే వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించి కాంట్రాక్టరు లారీలను కొద్దిసేపు నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బందపురం, దుద్దుకూరు, చెరుకుమిల్లి గ్రామాల రైతులు పొలాలకు వెళ్లేందుకు గుండుగొల ను నుంచి కొవ్వూరు వరకు నిర్మిస్తున్న హైవే వల్ల పుంత దారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆర్అండ్బీ అధికారులు జాతీయ రహదారిపై రైతులకు ఇబ్బంది లేకుండా మార్గమిస్తామని చెప్పి.. ప్రస్తుతం అడ్డంగా స్తంభాలు, డ్రెయినేజీ ఏర్పాటు చేయడం తగదని వాటిని తొలగించాల న్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమష్టిగా ఆందోళన ఉధృతం చేస్తామ న్నారు. రైతులు పాతూరి గణేష్రావు, దుద్దుపూడి సత్యనారాయణ, కొండేపాటి ప్రసాద్, కొండేపాటి బాపిరాజు తదితరులు ఉన్నారు.