కౌలు రైతుల నిరసన
ABN , First Publish Date - 2020-11-28T06:35:57+05:30 IST
జాతీయస్థాయి రైతు సంఘాల పిలుపు మేరకు కాజులూరులో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఏపీ కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
కాజులూరు: జాతీయస్థాయి రైతు సంఘాల పిలుపు మేరకు కాజులూరులో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఏపీ కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కౌలురైతు సంఘ నాయకులు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కౌలు రైతుసంఘం కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యవసాయబిల్లు, విద్యుత్ సంస్కరణలు రైతాంగానికి పెనుప్రమాదంగా మారాయని మండిపడ్డారు. కౌలురైతు సంఘ నాయకులు మేడిశెట్టి త్రిమూర్తులు, యాళ్ళ వై.చంద్రరావు, జక్కి శ్రీను, అల్లాడి నరసింహమూర్తి పాల్గొన్నారు.