స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలుపలేకపోతున్నందుకు చింతిస్తున్నాం: అనురాధ

ABN , First Publish Date - 2020-08-15T18:41:58+05:30 IST

ఎంతోమంది మహిళలు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని... స్వాతంత్ర్యం వస్తే మహిళలకు భద్రత వస్తుందని భావించారని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ గుర్తుచేశారు.

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలుపలేకపోతున్నందుకు చింతిస్తున్నాం: అనురాధ

అమరావతి: ఎంతోమంది మహిళలు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని... స్వాతంత్ర్యం వస్తే మహిళలకు భద్రత వస్తుందని భావించారని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ గుర్తుచేశారు. అమరావతిలో మహిళలను వెంటపడి వేధించారని అన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడతామని, మూడు రాజధానులంటూ అమరావతి విషయంలో అసత్యాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి స్వయం ప్రతిపత్తి కలిగించడం ఇలాంటి పాలకులు వస్తారని తెలిసే జరిగిందని అన్నారు. శిరోముండనం విషయంలో రాష్ట్రపతి స్పందించడం కొంతవరకైనా జీవించగలుగుతామని ఆశ కలిగిస్తోందని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలపలేకపోతున్నందుకు చింతిస్తున్నామని గద్దె అనురాధ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-08-15T18:41:58+05:30 IST