నాన్న కోలుకుంటున్నారు.. ప్రధానికి ధన్యవాదాలు: శరద్ యాదవ్ కుమార్తె

ABN , First Publish Date - 2020-09-25T03:14:42+05:30 IST

న్యూఢిల్లీ: అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోక్ తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్ కోలుకుంటున్నారు.

నాన్న కోలుకుంటున్నారు.. ప్రధానికి ధన్యవాదాలు: శరద్ యాదవ్ కుమార్తె

న్యూఢిల్లీ: అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోక్ తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్ కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌కు, బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వీరంతా రోజూ తన తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారని, ఆసుపత్రి వైద్య బృందాలతో పాటు తమ కుటుంబ సభ్యులతో కూడా నిరంతరం మాట్లాడుతున్నారని చెప్పారు.


అందరి ఆశీర్వాదాలతో తన తండ్రి కోలుకుని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయి వస్తారని సుభాషిణి ఆశాభావం వ్యక్తం చేశారు.    

Updated Date - 2020-09-25T03:14:42+05:30 IST