AP News: ఉల్లి రైతులతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముఖాముఖి

ABN , First Publish Date - 2022-09-14T17:59:49+05:30 IST

మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సీపీఐ నేత జగన్నాథం బుధవారం ఉదయం కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించారు.

AP News: ఉల్లి రైతులతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముఖాముఖి

కర్నూలు: మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి (Kotla Suryaprakash Reddy), సీపీఐ నేత జగన్నాథం (Jaganatham) బుధవారం ఉదయం కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించారు. ఉల్లి రైతులతో కోట్ల సూర్య ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉల్లి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఉల్లి సాగుకు భారీ పెటుబడులు పెట్టినా దిగుబడి తగ్గిందని తెలిపారు. క్వింటాలు ఉల్లి రూ.600 కూడా పలకడం లేదని అన్నారు. ప్రభుత్వమే క్వింటాలు ఉల్లి 4 వేలు చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనాం పద్ధతిలో కొనుగోలు నుంచి రైతులు నష్టపోతున్నారని అన్నారు. బహిరంగ వేలం ద్వారా ఉల్లి కొనుగోలు చేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-14T17:59:49+05:30 IST