కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కుమారుడి మృతి

ABN , First Publish Date - 2020-07-01T16:12:32+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్ (40) కరోనా వైరస్‌తో మరణించారు....

కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కుమారుడి మృతి

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్ (40) కరోనా వైరస్‌తో మరణించారు. లక్నో నగరానికి చెందిన దినేష్ కు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చింది. దీంతో దినేష్ ను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దినేష్ మరణించారు. సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడైన బేణిప్రసాద్ వర్మ ఈ ఏడాది మార్చి 27వతేదీన మరణించారు. బేణిప్రసాద్ వర్మ గతంలో యూపీఏ -2 ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు.

Updated Date - 2020-07-01T16:12:32+05:30 IST